Telangana Panchayat Elections-2025: రెండో విడతలో 415 సర్పంచ్, 8,304 మంది వార్డులు ఏకగ్రీవం...పోలింగ్ ఎప్పుడో తెలుసా?

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రంలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత పోలింగ్ డిసెంబర్ 11న, రెండో దశ పోలింగ్ డిసెంబర్ 14, మూడో దశ పోలింగ్ డిసెంబర్ 17న జరగనున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థానాలు ఏకగ్రీవం అవుతూ వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల రెండో విడతలో ఏకగ్రీవాలు భారీగా నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 415 మంది సర్పంచ్ అభ్యర్థులు, 8,304 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అధికారిక ప్రకటన చేసింది. కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 44 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా...నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో చెరో 38 స్థానాలు ఏకగ్రీవమైనట్లు తెలిపింది., News News, Times Now Telugu

Telangana Panchayat Elections-2025: రెండో విడతలో  415 సర్పంచ్, 8,304 మంది వార్డులు ఏకగ్రీవం...పోలింగ్ ఎప్పుడో తెలుసా?
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రంలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత పోలింగ్ డిసెంబర్ 11న, రెండో దశ పోలింగ్ డిసెంబర్ 14, మూడో దశ పోలింగ్ డిసెంబర్ 17న జరగనున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థానాలు ఏకగ్రీవం అవుతూ వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల రెండో విడతలో ఏకగ్రీవాలు భారీగా నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 415 మంది సర్పంచ్ అభ్యర్థులు, 8,304 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అధికారిక ప్రకటన చేసింది. కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 44 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా...నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో చెరో 38 స్థానాలు ఏకగ్రీవమైనట్లు తెలిపింది., News News, Times Now Telugu