ఉచిత బస్సు ప్రయాణానికి రెండేళ్లు.. మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఇక నుంచి వాటిలో కూడా..

తెలంగాణలో మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పథకం నేటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. గత రెండేళ్లలో 251 కోట్ల మంది మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోగా.. దీని విలువ రూ. 8,459 కోట్లుగా నమోదైంది. ఈ పథకం ద్వారా మహిళలకు ఉపాధి, విద్య, ఆధ్యాత్మిక ప్రయాణాలు సులువయ్యాయి. త్వరలోనే అన్ని ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని.. అలాగే ఆర్టీసీ స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఉచిత బస్సు ప్రయాణానికి రెండేళ్లు.. మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఇక నుంచి వాటిలో కూడా..
తెలంగాణలో మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పథకం నేటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. గత రెండేళ్లలో 251 కోట్ల మంది మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోగా.. దీని విలువ రూ. 8,459 కోట్లుగా నమోదైంది. ఈ పథకం ద్వారా మహిళలకు ఉపాధి, విద్య, ఆధ్యాత్మిక ప్రయాణాలు సులువయ్యాయి. త్వరలోనే అన్ని ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని.. అలాగే ఆర్టీసీ స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.