ఉల్లి, వెల్లుల్లి కోసం గొడవ.. 11 ఏళ్ల కాపురానికి ఫుల్‌స్టాప్ పెట్టిన అహ్మదాబాద్ దంపతులు

ఆహారపు అలవాట్లకు, మత విశ్వాసాలకు మధ్య తలెత్తిన వివాదం అహ్మదాబాద్‌లో 11 ఏళ్ల వైవాహిక బంధాన్ని బలిగొంది. స్వామినారాయణ సంప్రదాయాన్ని పాటించే భార్య, తన మతపరమైన ఆచారాల కారణంగా ఉల్లిపాయ, వెల్లుల్లిని తినడానికి నిరాకరించడంతో ఈ వివాదం మొదలైంది. భర్త, అత్తగారు వాటిని వాడడం కొనసాగించడంతో.. ఆహార భేదం క్రమంగా క్రూరత్వంగా మారిందని భర్త కోర్టులో వాదించారు. చివరకు గుజరాత్ హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత, భార్యాభర్తలు ఉభయ సమ్మతితో విడాకులు తీసుకోవడంతో ఈ సంచలన కేసు ముగిసింది.

ఉల్లి, వెల్లుల్లి కోసం గొడవ.. 11 ఏళ్ల కాపురానికి ఫుల్‌స్టాప్ పెట్టిన అహ్మదాబాద్ దంపతులు
ఆహారపు అలవాట్లకు, మత విశ్వాసాలకు మధ్య తలెత్తిన వివాదం అహ్మదాబాద్‌లో 11 ఏళ్ల వైవాహిక బంధాన్ని బలిగొంది. స్వామినారాయణ సంప్రదాయాన్ని పాటించే భార్య, తన మతపరమైన ఆచారాల కారణంగా ఉల్లిపాయ, వెల్లుల్లిని తినడానికి నిరాకరించడంతో ఈ వివాదం మొదలైంది. భర్త, అత్తగారు వాటిని వాడడం కొనసాగించడంతో.. ఆహార భేదం క్రమంగా క్రూరత్వంగా మారిందని భర్త కోర్టులో వాదించారు. చివరకు గుజరాత్ హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత, భార్యాభర్తలు ఉభయ సమ్మతితో విడాకులు తీసుకోవడంతో ఈ సంచలన కేసు ముగిసింది.