కీలక నిర్ణయం.. డిసెంబర్ 9 నుంచి ఏపీలో అవి బంద్.!

13 ఏళ్లు దాటిన వాహనాలపై ఫిట్‌నెస్ ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని ఏపీ లారీ ఓనర్ల సంఘం డిమాండ్ చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సరుకు రవాణా వాహనాల యజమానులకు పెనుభారం పడుతుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ నిలుపుదల చేసే అధికారం రాష్ట్రానికి ఉందని.. ఈ నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని కోరింది. లేకపోతే డిసెంబర్ 9 మంగళవారం అర్ధరాత్రి నుంచి షిప్ యార్డులు, రైల్వే షెడ్లలో గూడ్స్ రవాణా నిలిపివేస్తామని హెచ్చరించింది.

కీలక నిర్ణయం.. డిసెంబర్ 9 నుంచి ఏపీలో అవి బంద్.!
13 ఏళ్లు దాటిన వాహనాలపై ఫిట్‌నెస్ ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని ఏపీ లారీ ఓనర్ల సంఘం డిమాండ్ చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సరుకు రవాణా వాహనాల యజమానులకు పెనుభారం పడుతుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ నిలుపుదల చేసే అధికారం రాష్ట్రానికి ఉందని.. ఈ నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని కోరింది. లేకపోతే డిసెంబర్ 9 మంగళవారం అర్ధరాత్రి నుంచి షిప్ యార్డులు, రైల్వే షెడ్లలో గూడ్స్ రవాణా నిలిపివేస్తామని హెచ్చరించింది.