సాధారణ స్థితికి ఇండిగో సేవలు: పార్లమెంట్‌లో మంత్రి రామ్ మోహన్ నాయుడు ప్రకటన

దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ఇండిగో విమానాల రద్దుతో తలెత్తిన గందరగోళంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్ మోహన్ నాయుడు ఈరోజు లోక్‌సభలో ప్రకటన చేశారు. ఈ సంక్షోభానికి ఇండిగో విమాన సంస్థదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేసిన మంత్రి.. ప్రస్తుతం ఇండిగో కార్యకలాపాలు మళ్లీ గాడిలో పడ్డాయని తెలిపారు. ప్రయాణికులు ఎదుర్కొన్న తీవ్ర ఇబ్బందుల నేపథ్యంలో.. ఇండిగో సంక్షోభంపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు మంత్రి రామ్ మోహన్ నాయుడు తెలిపారు. ఇండిగో విమానయాన సంస్థ సీఈఓకు షోకాజు నోటీసులు కూడా జారీ చేసినట్లు వెల్లడించారు.

సాధారణ స్థితికి ఇండిగో సేవలు: పార్లమెంట్‌లో మంత్రి రామ్ మోహన్ నాయుడు ప్రకటన
దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ఇండిగో విమానాల రద్దుతో తలెత్తిన గందరగోళంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్ మోహన్ నాయుడు ఈరోజు లోక్‌సభలో ప్రకటన చేశారు. ఈ సంక్షోభానికి ఇండిగో విమాన సంస్థదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేసిన మంత్రి.. ప్రస్తుతం ఇండిగో కార్యకలాపాలు మళ్లీ గాడిలో పడ్డాయని తెలిపారు. ప్రయాణికులు ఎదుర్కొన్న తీవ్ర ఇబ్బందుల నేపథ్యంలో.. ఇండిగో సంక్షోభంపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు మంత్రి రామ్ మోహన్ నాయుడు తెలిపారు. ఇండిగో విమానయాన సంస్థ సీఈఓకు షోకాజు నోటీసులు కూడా జారీ చేసినట్లు వెల్లడించారు.