‘ప్రశాంతంగా ఉన్న దక్షిణాదిని తుఫానుగా మార్చొద్దు’ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రానికి స్టాలిన్ వార్నింగ్

ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలను పెంచే ఆలోచనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం.. అందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. అయితే, 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టే ఉద్దేశంతో ఉంది. దీనిపై దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దక్షిణాదిపై వివక్ష చూపుతున్నారని, 50 శాతం సీట్లను పెంచితే ఇక తమ అవసరమే ఉండదని ఆందోళన చెందుతున్నారు. తాజాగా, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు.

‘ప్రశాంతంగా ఉన్న దక్షిణాదిని తుఫానుగా మార్చొద్దు’ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రానికి స్టాలిన్ వార్నింగ్
ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలను పెంచే ఆలోచనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం.. అందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. అయితే, 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టే ఉద్దేశంతో ఉంది. దీనిపై దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దక్షిణాదిపై వివక్ష చూపుతున్నారని, 50 శాతం సీట్లను పెంచితే ఇక తమ అవసరమే ఉండదని ఆందోళన చెందుతున్నారు. తాజాగా, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు.