ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీ...మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ప్రకటన

విద్యుత్ శాఖలో సిబ్బంది కొర‌త‌ను భ‌ర్తీ చేసేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అనుమ‌తితో త్వ‌ర‌లోనే నియామక ప్రక్రియ చేప‌డ‌తామ‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. గురువారం నాడు మండలిలో సభ్యులు ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్, కావ‌లి గ్రీష్మ‌, బీటీ నాయుడు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి గొట్టిపాటి స‌మాధానం చెప్పారు. క్షేత్ర స్థాయిలో నాణ్య‌మైన విద్యుత్ స‌ర‌ఫ‌రాకు సిబ్బంది అవ‌స‌రం ఉంద‌ని మంత్రి తెలిపారు. నిరంత‌రాయ విద్యుత్ స‌ర‌ఫ‌రా, రీస్టోరేష‌న్ పనుల కోసం అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ వంటి వివిధ ప‌ద్ధ‌తుల ద్వారా నియామ‌క‌మైన 18,000 మంది సిబ్బంది విధులు నిర్వ‌హిస్తున్నార‌ని వెల్ల‌డించారు. రెగ్యుల‌ర్ మెయింటినెన్స్, విద్యుత్ అంత‌రాయాలు త‌గ్గించ‌డంతో పాటు ఓల్టేజ్ స్టెబిలిటీని పెంచ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నామ‌న్నారు. వినియోగ‌దారుల‌కు 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్ అందించే ల‌క్ష్యంతో విద్యుత్ శాఖ‌ ముందుకు వెళ్తుంద‌ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్ప‌ష్టం చేశారు., News News, Times Now Telugu

ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీ...మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ప్రకటన
విద్యుత్ శాఖలో సిబ్బంది కొర‌త‌ను భ‌ర్తీ చేసేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అనుమ‌తితో త్వ‌ర‌లోనే నియామక ప్రక్రియ చేప‌డ‌తామ‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. గురువారం నాడు మండలిలో సభ్యులు ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్, కావ‌లి గ్రీష్మ‌, బీటీ నాయుడు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి గొట్టిపాటి స‌మాధానం చెప్పారు. క్షేత్ర స్థాయిలో నాణ్య‌మైన విద్యుత్ స‌ర‌ఫ‌రాకు సిబ్బంది అవ‌స‌రం ఉంద‌ని మంత్రి తెలిపారు. నిరంత‌రాయ విద్యుత్ స‌ర‌ఫ‌రా, రీస్టోరేష‌న్ పనుల కోసం అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ వంటి వివిధ ప‌ద్ధ‌తుల ద్వారా నియామ‌క‌మైన 18,000 మంది సిబ్బంది విధులు నిర్వ‌హిస్తున్నార‌ని వెల్ల‌డించారు. రెగ్యుల‌ర్ మెయింటినెన్స్, విద్యుత్ అంత‌రాయాలు త‌గ్గించ‌డంతో పాటు ఓల్టేజ్ స్టెబిలిటీని పెంచ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నామ‌న్నారు. వినియోగ‌దారుల‌కు 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్ అందించే ల‌క్ష్యంతో విద్యుత్ శాఖ‌ ముందుకు వెళ్తుంద‌ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్ప‌ష్టం చేశారు., News News, Times Now Telugu