Andhra News: వేసిన తాళం వేసినట్టే ఉంచి.. డబ్బు, బంగారం కాజేస్తున్న కేటుగాళ్లు
Andhra News: వేసిన తాళం వేసినట్టే ఉంచి.. డబ్బు, బంగారం కాజేస్తున్న కేటుగాళ్లు
నెల్లూరు జిల్లాలో వరుస దొంగతనాలు స్థానికులను కలవరపెడుతున్నాయి. తాళాలు పగలగొట్టకుండా, ఎలాంటి అలికిడి లేకుండా విలువైన వస్తువులను మాయం చేస్తున్నారు కేటుగాళ్లు. వెంకటాచలం పరిధిలో కేవలం రెండు వారాల్లోనే నాలుగు చోరీలు పాల్పడ్డారు. ఈ వరుస చోరీలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దొంగలను త్వరగా పట్టుకోవాలని కోరుతున్నారు.
నెల్లూరు జిల్లాలో వరుస దొంగతనాలు స్థానికులను కలవరపెడుతున్నాయి. తాళాలు పగలగొట్టకుండా, ఎలాంటి అలికిడి లేకుండా విలువైన వస్తువులను మాయం చేస్తున్నారు కేటుగాళ్లు. వెంకటాచలం పరిధిలో కేవలం రెండు వారాల్లోనే నాలుగు చోరీలు పాల్పడ్డారు. ఈ వరుస చోరీలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దొంగలను త్వరగా పట్టుకోవాలని కోరుతున్నారు.