kumaram bheem asifabad- అర్హులకే సంక్షేమ పథకాలు

అర్హత గల ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాగజ్‌నగర్‌ ఎస్పీఎం క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు అందరికి వర్తించే దశల వారిగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జిల్లాలో రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారిని గుర్తించేట్టు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

kumaram bheem asifabad- అర్హులకే సంక్షేమ పథకాలు
అర్హత గల ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాగజ్‌నగర్‌ ఎస్పీఎం క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు అందరికి వర్తించే దశల వారిగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జిల్లాలో రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారిని గుర్తించేట్టు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.