అప్పన్న ఆశీస్సులతో అందరికీ ఆమోదయోగ్యమైన పాలన

వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆశీస్సులతో అందరికీ ఆమోదయోగ్యమైన పరిపాలన అందించేందుకు కృషిచేస్తానని జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ అన్నారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు ముందు ఆయన బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి సింహాద్రినాథుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి పుణ్యస్థలిలో పనిచేయడం ప్రతి అధికారికి సువర్ణ అవకాశం, అదృష్టమన్నారు. దేవుడి ఆశీస్సులతో ప్రజలకు ప్రయోజనకరమైన పనులు చేపట్టడంతోపాటు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేందుకు కృషిచేస్తానన్నారు.

అప్పన్న ఆశీస్సులతో  అందరికీ ఆమోదయోగ్యమైన పాలన
వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆశీస్సులతో అందరికీ ఆమోదయోగ్యమైన పరిపాలన అందించేందుకు కృషిచేస్తానని జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ అన్నారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు ముందు ఆయన బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి సింహాద్రినాథుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి పుణ్యస్థలిలో పనిచేయడం ప్రతి అధికారికి సువర్ణ అవకాశం, అదృష్టమన్నారు. దేవుడి ఆశీస్సులతో ప్రజలకు ప్రయోజనకరమైన పనులు చేపట్టడంతోపాటు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేందుకు కృషిచేస్తానన్నారు.