సుప్రీంకోర్టులో కలకలం.. పేపర్లు విసిరేసి, సీజేఐను దుర్భాషలాడిన పిటిషనర్

సర్వోన్నత న్యాయస్థానంలో శుక్రవారం ఉదయం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జస్టిస్ విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరాధేల ధర్మాసనం ముందు స్వయంగా వాదనలు వినిపించడానికి ఓ పిటిషనర్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు పేపర్లు చించిపడేసి, సీజేఐను నోటికొచ్చినట్టు మాట్లాడాడు. అంతటితో ఆగకుండా లక్నో ఏఎస్పీ సైబర్ క్రైమ్ సిండికేట్‌ నడుపుతున్నాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నానని న్యాయమూర్తులకే ఆర్డర్ జారీచేయడంతో వారు అవాక్కయ్యారు. మాకే ఆదేశాలు ఇస్తున్నారా? అని జస్టిస్ విశ్వనాథన్ వ్యాఖ్యానించారు.

సుప్రీంకోర్టులో కలకలం.. పేపర్లు విసిరేసి, సీజేఐను దుర్భాషలాడిన పిటిషనర్
సర్వోన్నత న్యాయస్థానంలో శుక్రవారం ఉదయం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జస్టిస్ విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరాధేల ధర్మాసనం ముందు స్వయంగా వాదనలు వినిపించడానికి ఓ పిటిషనర్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు పేపర్లు చించిపడేసి, సీజేఐను నోటికొచ్చినట్టు మాట్లాడాడు. అంతటితో ఆగకుండా లక్నో ఏఎస్పీ సైబర్ క్రైమ్ సిండికేట్‌ నడుపుతున్నాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నానని న్యాయమూర్తులకే ఆర్డర్ జారీచేయడంతో వారు అవాక్కయ్యారు. మాకే ఆదేశాలు ఇస్తున్నారా? అని జస్టిస్ విశ్వనాథన్ వ్యాఖ్యానించారు.