తెలంగాణకు రక్షణ రంగం బూస్ట్.. కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ!

న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కీలక సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖకు చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

తెలంగాణకు రక్షణ రంగం బూస్ట్.. కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ!
న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కీలక సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖకు చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.