చేయూత పింఛన్ల కోసం అర్హులైన వారికి నిరీక్షణ తప్పడం లేదు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున కొత్త పింఛన్లుమంజూరు చేస్తారని ఆశించిన వారికి మళ్లీ నిరాశే మిగిలింది. ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకుని ఉన్న ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరి రెండున్నరేళ్లు దాటి పోయినా ఆ ప్రక్రియ ముందుకు కదలడం లేదు. చేయూత పథకం కింద పింఛన్లను పెంచబోతున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ, గిరిజన శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. 2024 జూలైలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖలపై మంత్రి నిర్వహించిన సమీక్షలో పై విధంగా ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కొత్త పింఛన్ల జారీకి అ ర్హుల జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు
చేయూత పింఛన్ల కోసం అర్హులైన వారికి నిరీక్షణ తప్పడం లేదు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున కొత్త పింఛన్లుమంజూరు చేస్తారని ఆశించిన వారికి మళ్లీ నిరాశే మిగిలింది. ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకుని ఉన్న ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరి రెండున్నరేళ్లు దాటి పోయినా ఆ ప్రక్రియ ముందుకు కదలడం లేదు. చేయూత పథకం కింద పింఛన్లను పెంచబోతున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ, గిరిజన శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. 2024 జూలైలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖలపై మంత్రి నిర్వహించిన సమీక్షలో పై విధంగా ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కొత్త పింఛన్ల జారీకి అ ర్హుల జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు