‘వారు శరణార్థులు కాదు.. దేశం కోసం పోరాడిన యోధులు’.. మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు

దేశ విభజన, పాకిస్థాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చిన ప్రజల గురించి రాష్ట్రీయ స్వయంసేవక్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాగ్‌పూర్‌లో జరిగిన సింధు ఎడ్యుకేషన్ సొసైటీ 75వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, 1947 విభజన అనంతరం పాకిస్థాన్ నుంచి భారతదేశానికి వచ్చిన వారిని శరణార్థులు గా కాకుండా యోధులు గా చూడాలని అన్నారు. తమ మాతృభూమి, మతం పట్ల ఉన్న అచంచల విశ్వాసంతో వారు ఎన్నో కష్టాలను భరించి భారతదేశానికి వచ్చారని పేర్కొన్నారు.

‘వారు శరణార్థులు కాదు.. దేశం కోసం పోరాడిన యోధులు’.. మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
దేశ విభజన, పాకిస్థాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చిన ప్రజల గురించి రాష్ట్రీయ స్వయంసేవక్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాగ్‌పూర్‌లో జరిగిన సింధు ఎడ్యుకేషన్ సొసైటీ 75వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, 1947 విభజన అనంతరం పాకిస్థాన్ నుంచి భారతదేశానికి వచ్చిన వారిని శరణార్థులు గా కాకుండా యోధులు గా చూడాలని అన్నారు. తమ మాతృభూమి, మతం పట్ల ఉన్న అచంచల విశ్వాసంతో వారు ఎన్నో కష్టాలను భరించి భారతదేశానికి వచ్చారని పేర్కొన్నారు.