పిల్లలు కాదు పిడుగులు..! గ్రామీణ పాఠశాలలో సాహిత్య స్ఫూర్తి.. సర్కార్ బడిలో వికసించిన ‘గునుగు పూలు’..!
పిల్లలు కాదు పిడుగులు..! గ్రామీణ పాఠశాలలో సాహిత్య స్ఫూర్తి.. సర్కార్ బడిలో వికసించిన ‘గునుగు పూలు’..!
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అక్షరాల పరిమళం వెదజల్లింది. విద్యార్థుల కలం నుంచి జారిన పద్యాలు, కవితలు ‘గునుగుపూలు’గా వికసించి పుస్తకరూపం దాల్చాయి. గ్రామీణ పాఠశాలలోనే సాహిత్య స్ఫూర్తి ఇలా పరిమళించడం విశేషంగా మారింది. విద్యార్థులలో సాహిత్యాభిరుచిని పెంపొందించాలనే లక్ష్యంతో తెలుగు ఉపాధ్యాయులు ఆలోచనలకు బీజాలు నాటారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అక్షరాల పరిమళం వెదజల్లింది. విద్యార్థుల కలం నుంచి జారిన పద్యాలు, కవితలు ‘గునుగుపూలు’గా వికసించి పుస్తకరూపం దాల్చాయి. గ్రామీణ పాఠశాలలోనే సాహిత్య స్ఫూర్తి ఇలా పరిమళించడం విశేషంగా మారింది. విద్యార్థులలో సాహిత్యాభిరుచిని పెంపొందించాలనే లక్ష్యంతో తెలుగు ఉపాధ్యాయులు ఆలోచనలకు బీజాలు నాటారు.