India MEA: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులపై భారత్ ఫస్ట్ రియాక్షన్.. ఇండియా సపోర్ట్ ఎవరికి?

India MEA: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ రెండు దేశాలు ఇరాన్‌లో అల్లకల్లోలం సృష్టించాయి. ఈ దాడుల నేపథ్యంలో అన్ని దేశాలు వరుసగా స్పందించాయి. తాజాగా భారత్ సైతం తమ వైఖరిని వెల్లడించింది. Ministry of External Affairs (MEA) శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని పక్షాలు సహనం పాటించాలని పిలుపునిచ్చింది. “ఇరాన్, గల్ఫ్ ప్రాంతంలో తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యలను నివారించాలి. పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి” అని ఎమ్‌ఈఏ పేర్కొంది. సమస్యల పరిష్కారానికి సంభాషణ, దౌత్య మార్గాలనే అనుసరించాలని, ప్రతి దేశం సార్వభౌమాధికారాన్ని, భౌగోళిక సమగ్రతను గౌరవించాలని స్పష్టం చేసింది.

India MEA: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులపై భారత్ ఫస్ట్ రియాక్షన్.. ఇండియా సపోర్ట్ ఎవరికి?
India MEA: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ రెండు దేశాలు ఇరాన్‌లో అల్లకల్లోలం సృష్టించాయి. ఈ దాడుల నేపథ్యంలో అన్ని దేశాలు వరుసగా స్పందించాయి. తాజాగా భారత్ సైతం తమ వైఖరిని వెల్లడించింది. Ministry of External Affairs (MEA) శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని పక్షాలు సహనం పాటించాలని పిలుపునిచ్చింది. “ఇరాన్, గల్ఫ్ ప్రాంతంలో తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యలను నివారించాలి. పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి” అని ఎమ్‌ఈఏ పేర్కొంది. సమస్యల పరిష్కారానికి సంభాషణ, దౌత్య మార్గాలనే అనుసరించాలని, ప్రతి దేశం సార్వభౌమాధికారాన్ని, భౌగోళిక సమగ్రతను గౌరవించాలని స్పష్టం చేసింది.