Jaffar Express: పాక్ సైన్యానికి మరో షాక్.. సైనికులు ప్రయాణిస్తున్న రైలు పట్టాలపై భారీ పేలుడు, 6 నెలల్లో 5 సార్లు దాడులు
Jaffar Express: పాక్ సైన్యానికి మరో షాక్.. సైనికులు ప్రయాణిస్తున్న రైలు పట్టాలపై భారీ పేలుడు, 6 నెలల్లో 5 సార్లు దాడులు
Jaffar Express: పాకిస్తాన్ సైన్యానికి.. బలూచిస్తాన్ వేర్పాటు గ్రూపుల మధ్య యుద్ధం కొనసాగుతోంది. జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును టార్గెట్గా చేసుకుని.. మరోసారి బలూచ్ వేర్పాటు వాదులు భారీ దాడి చేశారు. పాక్ సైన్యం ప్రయాణిస్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ వెళ్లే మార్గంలో పట్టాలపై ఐఈడీ బాంబులు పెట్టి పేల్చారు. ఈ ఘటనలో దాదాపు 6 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ఆ రైలులో ప్రయాణిస్తున్న చాలా మందికి గాయాలు అయ్యాయి. ఇక ఈ దాడి చేసింది తామే అంటూ బలూచ్ గ్రూపులు ప్రకటించాయి. గత 6 నెలల్లో ఐదు సార్లు ఈ జాఫర్ ఎక్స్ప్రెస్పై దాడులు జరగడం గమనార్హం.
Jaffar Express: పాకిస్తాన్ సైన్యానికి.. బలూచిస్తాన్ వేర్పాటు గ్రూపుల మధ్య యుద్ధం కొనసాగుతోంది. జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును టార్గెట్గా చేసుకుని.. మరోసారి బలూచ్ వేర్పాటు వాదులు భారీ దాడి చేశారు. పాక్ సైన్యం ప్రయాణిస్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ వెళ్లే మార్గంలో పట్టాలపై ఐఈడీ బాంబులు పెట్టి పేల్చారు. ఈ ఘటనలో దాదాపు 6 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ఆ రైలులో ప్రయాణిస్తున్న చాలా మందికి గాయాలు అయ్యాయి. ఇక ఈ దాడి చేసింది తామే అంటూ బలూచ్ గ్రూపులు ప్రకటించాయి. గత 6 నెలల్లో ఐదు సార్లు ఈ జాఫర్ ఎక్స్ప్రెస్పై దాడులు జరగడం గమనార్హం.