కూలీల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న క్షేత్రస్థాయి ఉద్యోగులు
కూలీల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న క్షేత్రస్థాయి ఉద్యోగులు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు వెళుతున్న కూలీల నుంచి కొంతమంది సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీవోలతోపాటు, కార్యాలయం సిబ్బందికి ఖర్చుల కోసం ఒక్కో కూలీ వారానికి వంద రూపాయల చొప్పున ఇవ్వాలని, లేకపోతే మస్తరు (హాజరు) నమోదు చేసేది లేదని క్షేత్రస్థాయిలో సిబ్బంది బెదిరిస్తున్నారు. మామూళ్లు ఇవ్వని పక్షంలో వారికి కూలి డబ్బులు తక్కువ వచ్చేలా చేయడం, పనులు కల్పించకపోవడం వంటి చర్యలతో గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ తరహా అక్రమ వసూళ్లపై పలువురు కూలీలు పని ప్రదేశంలో సిబ్బందిని నిలదీస్తుండగా, మరికొందరు మండల, జిల్లాస్థాయి అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు వెళుతున్న కూలీల నుంచి కొంతమంది సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీవోలతోపాటు, కార్యాలయం సిబ్బందికి ఖర్చుల కోసం ఒక్కో కూలీ వారానికి వంద రూపాయల చొప్పున ఇవ్వాలని, లేకపోతే మస్తరు (హాజరు) నమోదు చేసేది లేదని క్షేత్రస్థాయిలో సిబ్బంది బెదిరిస్తున్నారు. మామూళ్లు ఇవ్వని పక్షంలో వారికి కూలి డబ్బులు తక్కువ వచ్చేలా చేయడం, పనులు కల్పించకపోవడం వంటి చర్యలతో గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ తరహా అక్రమ వసూళ్లపై పలువురు కూలీలు పని ప్రదేశంలో సిబ్బందిని నిలదీస్తుండగా, మరికొందరు మండల, జిల్లాస్థాయి అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు.