ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా వర్షాకాలంలో ఆశించిన మేరకు వర్షాలు పడతాయని భావిస్తున్న రైతులను ఎలినినో భయభ్రాంతులకు గురిచేస్తున్నది. ఈ ఏడాది ఆశించిన మేరకు వర్షాలు పడవని, వరి లాంటి పం టలను సాగు చేయడం కష్టమని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ వానాకాలంలో సుమారు 4.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో పత్తి 3,70,919ఎకరాలు, వరి 42,228ఎకరాలు, కంది 20,817ఎకరాలు, సోయా 1326ఎకరాలు, మొక్కజొన్న 668ఎకరాలు, 11,254ఎకరాల్లో ఇతర పంటలను సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే ప్రస్త్తుం అన్నిచోట్ల రైతులు పొలాలు శుభ్రం చేసి తాము వేయాలనుకున్న పంటలకు అనుగుణంగా దుక్కులు దున్నుకొని పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు.
ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా వర్షాకాలంలో ఆశించిన మేరకు వర్షాలు పడతాయని భావిస్తున్న రైతులను ఎలినినో భయభ్రాంతులకు గురిచేస్తున్నది. ఈ ఏడాది ఆశించిన మేరకు వర్షాలు పడవని, వరి లాంటి పం టలను సాగు చేయడం కష్టమని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ వానాకాలంలో సుమారు 4.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో పత్తి 3,70,919ఎకరాలు, వరి 42,228ఎకరాలు, కంది 20,817ఎకరాలు, సోయా 1326ఎకరాలు, మొక్కజొన్న 668ఎకరాలు, 11,254ఎకరాల్లో ఇతర పంటలను సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే ప్రస్త్తుం అన్నిచోట్ల రైతులు పొలాలు శుభ్రం చేసి తాము వేయాలనుకున్న పంటలకు అనుగుణంగా దుక్కులు దున్నుకొని పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు.