kumaram bheem asifabad- ఎస్పీఎంలో వెంటనే ఎన్నికలు నిర్వహించాలి

ఎస్పీఎంలో వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాద్యక్షుడు మల్లికార్జున్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం అడిషనల్‌ లేబర్‌ కమిషనర్‌ గంగాధర్‌కు వినతి పత్రం అందజేశారు. ఎస్పీఎం పునః ప్రారంభించిన 2018 ఆగస్టు నుంచి మిల్లును టేకోవర్‌ చేసిన జేకే యాజమాన్యం ఎన్నికలు నిర్వహించేందుకు అవాంతరాలు సృష్టిస్తోందన్నారు. మిల్లులో 277 మంది పర్మనెంటు కార్మికులతో కలిపి సుమారు 2,188 మంది పని చేస్తున్నప్పటికీ వారికి ఎలాంటి భద్రత లేదన్నారు. లేబర్‌ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కూడా ఫలితం లేకపోగా మిల్లు యాజమాన్యం ఎన్నికలు జరుగకుండా కోర్టును ఆశ్రయించిందన్నారు.

kumaram bheem asifabad- ఎస్పీఎంలో వెంటనే ఎన్నికలు నిర్వహించాలి
ఎస్పీఎంలో వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాద్యక్షుడు మల్లికార్జున్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం అడిషనల్‌ లేబర్‌ కమిషనర్‌ గంగాధర్‌కు వినతి పత్రం అందజేశారు. ఎస్పీఎం పునః ప్రారంభించిన 2018 ఆగస్టు నుంచి మిల్లును టేకోవర్‌ చేసిన జేకే యాజమాన్యం ఎన్నికలు నిర్వహించేందుకు అవాంతరాలు సృష్టిస్తోందన్నారు. మిల్లులో 277 మంది పర్మనెంటు కార్మికులతో కలిపి సుమారు 2,188 మంది పని చేస్తున్నప్పటికీ వారికి ఎలాంటి భద్రత లేదన్నారు. లేబర్‌ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కూడా ఫలితం లేకపోగా మిల్లు యాజమాన్యం ఎన్నికలు జరుగకుండా కోర్టును ఆశ్రయించిందన్నారు.