ప్రభుత్వ భూమి ఇంచు కూడా పోవద్దు.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
మాదాపూర్లోని తమ్మిడికుంట, సున్నం చెరువుల పునరుద్ధరణ పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెండు నెలల్లోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.