ప్రభుత్వ, పారిశ్రామిక అవసరా లకోసం మండలాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటుకానున్న పారిశ్రామిక ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలకు సంబందించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. భూములు అందజేస్తున్న రైతులను ఒప్పించాలని, పరిశ్రమల స్థాపన ద్వారా పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి లభిస్తుందని వారికి నచ్చచెప్పాలని సూచించారు. సమావేశంలోని డీఆర్వో చందక సత్తిబాబు, ఆర్డీవోలు వెంకటేశ్వరరావు, సుధాసాగర్, మోహనరావు పాల్గొన్నారు.
ప్రభుత్వ, పారిశ్రామిక అవసరా లకోసం మండలాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటుకానున్న పారిశ్రామిక ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలకు సంబందించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. భూములు అందజేస్తున్న రైతులను ఒప్పించాలని, పరిశ్రమల స్థాపన ద్వారా పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి లభిస్తుందని వారికి నచ్చచెప్పాలని సూచించారు. సమావేశంలోని డీఆర్వో చందక సత్తిబాబు, ఆర్డీవోలు వెంకటేశ్వరరావు, సుధాసాగర్, మోహనరావు పాల్గొన్నారు.