భార్యాపిల్లల హత్య కేసులో 23 ఏళ్లుగా జైలుశిక్ష.. ఎట్టకేలకు నిర్దోషిగా తేల్చిన అలహాబాద్ హైకోర్టు

అది 2003 ఆగస్టు 29వ తేదీ అర్థరాత్రి. ఆరోజే ఒక కుటుంబం మొత్తం చిన్నాభిన్నమైంది. భార్య, ముగ్గురు పసిపిల్లలు గొంతు కోయబడి విగతజీవులుగా పడి ఉన్నారు. హంతకుడు తండ్రేనని పోలీసులు తేల్చారు. కోర్టు జీవితకాల శిక్ష వేసింది. కానీ సరిగ్గా 23 ఏళ్ల తర్వాత అదే కేసులో నిందితుడు నిర్దోషి అని అలహాబాద్ హైకోర్టు తేల్చింది. ముఖ్యంగా అప్పట్లో తండ్రికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన ఐదేళ్ల బాలుడు.. తనతో బలవంతంగా అలా చెప్పించారని చెప్పడం, చిన్న కత్తితో గొంతు కోశాడని పోలీసులు చెప్పగా, బలమైన మారణాయుధంతోనే వారి తలలు, మెండాలను వేరు చేశారని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఈ తప్పిదాలను గుర్తించిన న్యాయస్థానం న్యాయవ్యవస్థపై ఉన్న లోపాలను కూడా ఎత్తి చూపింది.

భార్యాపిల్లల హత్య కేసులో 23 ఏళ్లుగా జైలుశిక్ష.. ఎట్టకేలకు నిర్దోషిగా తేల్చిన అలహాబాద్ హైకోర్టు
అది 2003 ఆగస్టు 29వ తేదీ అర్థరాత్రి. ఆరోజే ఒక కుటుంబం మొత్తం చిన్నాభిన్నమైంది. భార్య, ముగ్గురు పసిపిల్లలు గొంతు కోయబడి విగతజీవులుగా పడి ఉన్నారు. హంతకుడు తండ్రేనని పోలీసులు తేల్చారు. కోర్టు జీవితకాల శిక్ష వేసింది. కానీ సరిగ్గా 23 ఏళ్ల తర్వాత అదే కేసులో నిందితుడు నిర్దోషి అని అలహాబాద్ హైకోర్టు తేల్చింది. ముఖ్యంగా అప్పట్లో తండ్రికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన ఐదేళ్ల బాలుడు.. తనతో బలవంతంగా అలా చెప్పించారని చెప్పడం, చిన్న కత్తితో గొంతు కోశాడని పోలీసులు చెప్పగా, బలమైన మారణాయుధంతోనే వారి తలలు, మెండాలను వేరు చేశారని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఈ తప్పిదాలను గుర్తించిన న్యాయస్థానం న్యాయవ్యవస్థపై ఉన్న లోపాలను కూడా ఎత్తి చూపింది.