విషాదం.. విద్యుత్ స్తంభం కూలి బాలుడి మృతి
గుజరాత్లోని ఖేడాలో విషాదం చోటు చేసుకుంది. పాఠశాలకు వెళ్తుండగా ఓ బాలుడిపై కరెంట్ స్తంభం కూలి మీదపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆరుగురు అక్కాచెల్లెళ్లకు ఒక్కడే సోదరుడు కావడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.