ఏపీలో వారికి తీపికబురు.. వడ్డీ మాఫీ.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ సంక్షేమ శాఖలో రుణాలు తీసుకున్న వారికి ఉపశమనం కల్పించేలా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన 11, 479 మంది లబ్ధిదారులకు రూ.41 కోట్ల మేర వడ్డీని మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయ పేర్లను మార్చే ప్రతిపాదనలకు కూడా ఏపీ మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది.

ఏపీలో వారికి తీపికబురు.. వడ్డీ మాఫీ.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ సంక్షేమ శాఖలో రుణాలు తీసుకున్న వారికి ఉపశమనం కల్పించేలా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన 11, 479 మంది లబ్ధిదారులకు రూ.41 కోట్ల మేర వడ్డీని మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయ పేర్లను మార్చే ప్రతిపాదనలకు కూడా ఏపీ మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది.