'జాతీయ గీతాలు పాడిన తర్వాతే రాష్ట్ర గీతాలు ఆలపించాలి': కేంద్ర హోంశాఖ కొత్త గైడ్‌లైన్స్

జాతీయ గీతం, జాతీయ గేయాలు వాడడంపై కేంద్ర హోంశాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రాల్లో ప్రత్యేక గీతాలు ఉన్నప్పటికీ.. ముందుగా వందేమాతరం, జనగణమన పాడిన తర్వాతే రాష్ట్ర గీతాన్ని ఆలపించాలని స్పష్టం చేసింది. ఇటీవల తమిళనాడు ప్రభుత్వ కార్యక్రమంలో జరిగిన వివాదం నేపథ్యంలో ఈ ఆదేశాలు వచ్చాయి. అధికారిక కార్యక్రమాల్లో 3 నిమిషాల 10 సెకన్ల నిడివి గల ఆరు చరణాల వందేమాతరాన్ని ఎలాంటి తప్పులు, పదాల మార్పులు లేకుండా పాడాలని కేంద్రం ఆదేశించింది. ఒకవేళ నింబధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.

'జాతీయ గీతాలు పాడిన తర్వాతే రాష్ట్ర గీతాలు ఆలపించాలి': కేంద్ర హోంశాఖ కొత్త గైడ్‌లైన్స్
జాతీయ గీతం, జాతీయ గేయాలు వాడడంపై కేంద్ర హోంశాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రాల్లో ప్రత్యేక గీతాలు ఉన్నప్పటికీ.. ముందుగా వందేమాతరం, జనగణమన పాడిన తర్వాతే రాష్ట్ర గీతాన్ని ఆలపించాలని స్పష్టం చేసింది. ఇటీవల తమిళనాడు ప్రభుత్వ కార్యక్రమంలో జరిగిన వివాదం నేపథ్యంలో ఈ ఆదేశాలు వచ్చాయి. అధికారిక కార్యక్రమాల్లో 3 నిమిషాల 10 సెకన్ల నిడివి గల ఆరు చరణాల వందేమాతరాన్ని ఎలాంటి తప్పులు, పదాల మార్పులు లేకుండా పాడాలని కేంద్రం ఆదేశించింది. ఒకవేళ నింబధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.