పక్కింటి వరండాలో పంది మాంసం చల్లినందుకు.. సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తికి 14 వారాల జైలుశిక్ష

పక్కింటి వారితో మనస్పర్థలు రావడం సహజమే.. కానీ ఆ కోపం హద్దులు దాటి ఇతర మతాల విశ్వాసాలను దెబ్బతీసేలా చేస్తే తాము అస్సలే ఊరుకోమని నిరూపించింది సింగపూర్. ముఖ్యంగా అక్కడ నివసిస్తున్న ఓ భారత సంతతి వ్యక్తి.. దీపావళి పండుగ రోజున పక్కింటి వారితో జరిగిన చిన్న గొడవతో.. ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించాడు. ముఖ్యంగా వారి వరండాలో పంది మాంసం చల్లి వారిని ఇబ్బందికి గురి చేశాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆపై ఈ కేసు న్యాయస్థానానికి వెళ్లగా.. అతడి తప్పును తీవ్రంగా పరిగణించిన కోర్టు.. అతడికి 14 వారాల జైలుశిక్ష విధించింది.

పక్కింటి వరండాలో పంది మాంసం చల్లినందుకు.. సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తికి 14 వారాల జైలుశిక్ష
పక్కింటి వారితో మనస్పర్థలు రావడం సహజమే.. కానీ ఆ కోపం హద్దులు దాటి ఇతర మతాల విశ్వాసాలను దెబ్బతీసేలా చేస్తే తాము అస్సలే ఊరుకోమని నిరూపించింది సింగపూర్. ముఖ్యంగా అక్కడ నివసిస్తున్న ఓ భారత సంతతి వ్యక్తి.. దీపావళి పండుగ రోజున పక్కింటి వారితో జరిగిన చిన్న గొడవతో.. ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించాడు. ముఖ్యంగా వారి వరండాలో పంది మాంసం చల్లి వారిని ఇబ్బందికి గురి చేశాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆపై ఈ కేసు న్యాయస్థానానికి వెళ్లగా.. అతడి తప్పును తీవ్రంగా పరిగణించిన కోర్టు.. అతడికి 14 వారాల జైలుశిక్ష విధించింది.