రేపటి నుంచి కథ వేరే ఉంటది.. తోలు తీస్తాం: కేసీఆర్

తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. గత రెండేళ్లుగా మౌనంగా ఉండి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చానని.. కానీ రాష్ట్ర ప్రయోజనాలకు అన్యాయం జరుగుతుంటే ఇకపై ఊరుకోనని హెచ్చరించారు. ‘తెలంగాణను అన్యాయం చేసే పద్ధతుల్లో వ్యవహరిస్తే తోలు తీస్తా, రేపటి నుంచి కథ వేరే ఉంటది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల విషయంలో కేంద్రంపై యుద్ధం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని ఆయన ప్రశ్నించారు. త్వరలోనే ప్రజా క్షేత్రంలోకి వెళ్లి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతామని కేసీఆర్ స్పష్టం చేశారు.

రేపటి నుంచి కథ వేరే ఉంటది.. తోలు తీస్తాం: కేసీఆర్
తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. గత రెండేళ్లుగా మౌనంగా ఉండి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చానని.. కానీ రాష్ట్ర ప్రయోజనాలకు అన్యాయం జరుగుతుంటే ఇకపై ఊరుకోనని హెచ్చరించారు. ‘తెలంగాణను అన్యాయం చేసే పద్ధతుల్లో వ్యవహరిస్తే తోలు తీస్తా, రేపటి నుంచి కథ వేరే ఉంటది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల విషయంలో కేంద్రంపై యుద్ధం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని ఆయన ప్రశ్నించారు. త్వరలోనే ప్రజా క్షేత్రంలోకి వెళ్లి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతామని కేసీఆర్ స్పష్టం చేశారు.