15 ఏళ్ల నిరీక్షణ ఫలించింది.. ఢిల్లీ జూలో కృత్రిమంగా గుడ్లు పొదిగి మూడు నాగుపాము పిల్లల సృష్టి!

వన్యప్రాణి సంరక్షణ, శాస్త్రీయ జంతు నిర్వహణలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ.. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రసిద్ధ నేషనల్ జూలాజికల్ పార్క్ సుమారు 15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. గత దశాబ్ద కాలానికి పైగా సాగుతున్న విఫల యత్నాలకు స్వస్తి పలుకుతూ.. జూ వెటర్నరీ వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో కృత్రిమంగా గుడ్లు పొదిగే పద్ధతి ద్వారా మూడు నాగుపాము పిల్లలు విజయవంతంగా జన్మించాయి. జూన్ 29, 30 తేదీల్లో గుడ్ల నుంచి బయటకు వచ్చిన ఈ మూడు సర్పాల పిల్లలు ప్రస్తుతం అత్యంత ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్నాయని జూ డైరెక్టర్ సంజీత్ కుమార్ వెల్లడించారు.

15 ఏళ్ల నిరీక్షణ ఫలించింది.. ఢిల్లీ జూలో కృత్రిమంగా గుడ్లు పొదిగి మూడు నాగుపాము పిల్లల సృష్టి!
వన్యప్రాణి సంరక్షణ, శాస్త్రీయ జంతు నిర్వహణలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ.. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రసిద్ధ నేషనల్ జూలాజికల్ పార్క్ సుమారు 15 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. గత దశాబ్ద కాలానికి పైగా సాగుతున్న విఫల యత్నాలకు స్వస్తి పలుకుతూ.. జూ వెటర్నరీ వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో కృత్రిమంగా గుడ్లు పొదిగే పద్ధతి ద్వారా మూడు నాగుపాము పిల్లలు విజయవంతంగా జన్మించాయి. జూన్ 29, 30 తేదీల్లో గుడ్ల నుంచి బయటకు వచ్చిన ఈ మూడు సర్పాల పిల్లలు ప్రస్తుతం అత్యంత ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్నాయని జూ డైరెక్టర్ సంజీత్ కుమార్ వెల్లడించారు.