'40 ఏళ్లుగా దేశాన్ని ఉగ్రవాద అడ్డాగా మార్చారు': కెనడాపై భారత రాయబారి నిప్పులు

నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ కెనడా చేస్తున్న ప్రచారాన్ని భారత హైకమిషనర్ దినేష్ పట్నాయక్ తీవ్రస్థాయిలో తిప్పికొట్టారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కెనడా గత 40 ఏళ్లుగా ఉగ్రవాద శక్తులకు స్వర్గధామంగా మారిందని.. 329 మంది ప్రాణాలను బలిగొన్న ‘కనిష్క’ విమానం పేలుడు నిందితులను కూడా శిక్షించలేకపోయారని ఆయన ముఖం మీదే విమర్శించారు. భారత్ తగిన ఆధారాలతో ఉగ్రవాదుల జాబితా ఇస్తే.. సాక్ష్యాలు సరిపోవని తప్పించుకునే కెనడా.. ఇప్పుడు ఎటువంటి ఆధారాలు లేకుండా భారత్‌ను నిందించడం ఆ దేశ ద్వంద్వ నీతికి నిదర్శనమని పట్నాయక్ మండిపడ్డారు.

'40 ఏళ్లుగా దేశాన్ని ఉగ్రవాద అడ్డాగా మార్చారు': కెనడాపై భారత రాయబారి నిప్పులు
నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ కెనడా చేస్తున్న ప్రచారాన్ని భారత హైకమిషనర్ దినేష్ పట్నాయక్ తీవ్రస్థాయిలో తిప్పికొట్టారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కెనడా గత 40 ఏళ్లుగా ఉగ్రవాద శక్తులకు స్వర్గధామంగా మారిందని.. 329 మంది ప్రాణాలను బలిగొన్న ‘కనిష్క’ విమానం పేలుడు నిందితులను కూడా శిక్షించలేకపోయారని ఆయన ముఖం మీదే విమర్శించారు. భారత్ తగిన ఆధారాలతో ఉగ్రవాదుల జాబితా ఇస్తే.. సాక్ష్యాలు సరిపోవని తప్పించుకునే కెనడా.. ఇప్పుడు ఎటువంటి ఆధారాలు లేకుండా భారత్‌ను నిందించడం ఆ దేశ ద్వంద్వ నీతికి నిదర్శనమని పట్నాయక్ మండిపడ్డారు.