ఏపీలో రైతులకు గుడ్ న్యూస్...ముడి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం జీరోకి తగ్గింపు

ఎలాంటి బ్రాండ్ లేని ముడి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని సున్నాకు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతించారు. ఇది రాష్ట్రంలో జరిగే అన్ బ్రాండెడ్ పొగాకు వాణిజ్యానికి ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈమేరకు కేంద్ర ఆర్ధిక శాఖ జారీ చేసిన గెజిట్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. శుద్ధి చేయని పొగాకుకు(హెచ్ఎస్ కోడ్ 2401) వర్తించే సుంకం విధానాన్ని స్పష్టం చేస్తూ ఆర్ధిక శాఖ ఈ గెజిట్‌ను జారీ చేసింది. ఇక నుంచి అన్ బ్రాండెడ్ పొగాకు రీటైల్ విక్రయాలకు ఎక్సైజ్ సుంకం సున్నా గా పేర్కొంటూ ఈ గెజిట్‌ను కేంద్రం విడుదల చేసింది.పొగాకు విక్రయాలపై పన్నుల విషయంలో ఏకరూపత, స్పష్టత, పారదర్శకంగా ఉండేలా ఈ గెజిట్‌ను కేంద్ర ఆర్ధిక శాఖ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కీలకమైన ముందడుగని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు, News News, Times Now Telugu

ఏపీలో రైతులకు గుడ్ న్యూస్...ముడి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం జీరోకి తగ్గింపు
ఎలాంటి బ్రాండ్ లేని ముడి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని సున్నాకు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతించారు. ఇది రాష్ట్రంలో జరిగే అన్ బ్రాండెడ్ పొగాకు వాణిజ్యానికి ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈమేరకు కేంద్ర ఆర్ధిక శాఖ జారీ చేసిన గెజిట్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. శుద్ధి చేయని పొగాకుకు(హెచ్ఎస్ కోడ్ 2401) వర్తించే సుంకం విధానాన్ని స్పష్టం చేస్తూ ఆర్ధిక శాఖ ఈ గెజిట్‌ను జారీ చేసింది. ఇక నుంచి అన్ బ్రాండెడ్ పొగాకు రీటైల్ విక్రయాలకు ఎక్సైజ్ సుంకం సున్నా గా పేర్కొంటూ ఈ గెజిట్‌ను కేంద్రం విడుదల చేసింది.పొగాకు విక్రయాలపై పన్నుల విషయంలో ఏకరూపత, స్పష్టత, పారదర్శకంగా ఉండేలా ఈ గెజిట్‌ను కేంద్ర ఆర్ధిక శాఖ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కీలకమైన ముందడుగని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు, News News, Times Now Telugu