కేంద్రమంత్రి పంకజ్ చౌదరికే యూపీ బీజేపీ చీఫ్ పదవి?

ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ అధిష్ఠానం కీలక అడుగు వేయడానికి సిద్ధమైంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, ఏడుసార్లు ఎంపీ అయిన పంకజ్ చౌదరీని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. 2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. యాదవేతర ఓబీసీ వర్గం (కుర్మీలు) ఓట్లను ఏకం చేయడమే లక్ష్యంగా బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. మహారాజ్‌గంజ్ నుంచి గెలుపొందిన చౌదరీ నేడు నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, వినోద్ తవాడే హాజరు కానున్నారు.

కేంద్రమంత్రి పంకజ్ చౌదరికే యూపీ బీజేపీ చీఫ్ పదవి?
ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ అధిష్ఠానం కీలక అడుగు వేయడానికి సిద్ధమైంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, ఏడుసార్లు ఎంపీ అయిన పంకజ్ చౌదరీని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. 2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. యాదవేతర ఓబీసీ వర్గం (కుర్మీలు) ఓట్లను ఏకం చేయడమే లక్ష్యంగా బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. మహారాజ్‌గంజ్ నుంచి గెలుపొందిన చౌదరీ నేడు నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, వినోద్ తవాడే హాజరు కానున్నారు.