సర్పంచ్ ఎన్నికల బరిలో ఎంబీబీఎస్ విద్యార్థిని.. రేపటి ఎన్నికల ఏర్పాట్లు పూర్తి..

తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ రేపు (ఆదివారం) జరగనుంది. మొత్తం 4,332 పంచాయతీలకు గాను.. 415 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 3,911 పంచాయతీలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. వికారాబాద్ జిల్లా, దొంగ ఎన్కేపల్లి గ్రామంలో ఎంబీబీఎస్ విద్యార్థిని శ్రీయ రెడ్డి సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. ప్రజా సేవ లక్ష్యంగా.. యువతకు స్వయం ఉపాధి కల్పించే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చానని ఆమె తెలిపారు. పట్టణాల నుంచి ఓటర్లు స్వగ్రామాలకు తరలిరావడంతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి.

సర్పంచ్ ఎన్నికల బరిలో ఎంబీబీఎస్ విద్యార్థిని.. రేపటి ఎన్నికల ఏర్పాట్లు పూర్తి..
తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ రేపు (ఆదివారం) జరగనుంది. మొత్తం 4,332 పంచాయతీలకు గాను.. 415 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 3,911 పంచాయతీలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. వికారాబాద్ జిల్లా, దొంగ ఎన్కేపల్లి గ్రామంలో ఎంబీబీఎస్ విద్యార్థిని శ్రీయ రెడ్డి సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. ప్రజా సేవ లక్ష్యంగా.. యువతకు స్వయం ఉపాధి కల్పించే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చానని ఆమె తెలిపారు. పట్టణాల నుంచి ఓటర్లు స్వగ్రామాలకు తరలిరావడంతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి.