పండగపూట మరో విషాదం: ప్రార్థన చేస్తుండగానే పేలిన బాంబు.. ఏడుగురు మృతి

దైవ ప్రార్థనలో నిమగ్నమైన భక్తులపై మృత్యువు బాంబు రూపంలో విరుచుకుపడింది. నైజీరియాలోని మైదుగురి నగరంలో బుధవారం సాయంత్రం ఒక మసీదులో జరిగిన భీకర పేలుడు ఏడుగురు అమాయక భక్తులను బలితీసుకుంది. గంబోరు మార్కెట్ ప్రాంతంలోని మసీదులో నమాజ్ కోసం వందలాది మంది గుమిగూడిన సమయంలో.. ప్రార్థనలు మధ్యలో ఉండగానే ఒక్కసారిగా విస్ఫోటనం సంభవించింది. భీకరమైన శబ్దంతో మసీదు దద్దరిల్లిపోగా.. క్షణాల్లో ఆ ప్రార్థనా స్థలం రక్తసిక్తమైంది. కనీసం ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు.

పండగపూట మరో విషాదం: ప్రార్థన చేస్తుండగానే పేలిన బాంబు.. ఏడుగురు మృతి
దైవ ప్రార్థనలో నిమగ్నమైన భక్తులపై మృత్యువు బాంబు రూపంలో విరుచుకుపడింది. నైజీరియాలోని మైదుగురి నగరంలో బుధవారం సాయంత్రం ఒక మసీదులో జరిగిన భీకర పేలుడు ఏడుగురు అమాయక భక్తులను బలితీసుకుంది. గంబోరు మార్కెట్ ప్రాంతంలోని మసీదులో నమాజ్ కోసం వందలాది మంది గుమిగూడిన సమయంలో.. ప్రార్థనలు మధ్యలో ఉండగానే ఒక్కసారిగా విస్ఫోటనం సంభవించింది. భీకరమైన శబ్దంతో మసీదు దద్దరిల్లిపోగా.. క్షణాల్లో ఆ ప్రార్థనా స్థలం రక్తసిక్తమైంది. కనీసం ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు.