రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఏపీ - తెలంగాణ మధ్య మరో వీక్లీ ఎక్స్‌ప్రెస్..

తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త వినిపించింది. ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ మధ్య మరో వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. చర్లపల్లి - నర్సాపూర్ మధ్య ఎక్స్‌ప్రెస్ రైలు రాకపోకలు సాగించనుంది. చర్లపల్లి రైల్వేస్టేషన్‍లో ప్రారంభమయ్యే ఈ రైలు నల్గొండ, గుంటూరు, విజయవాడ రైల్వేస్టేషన్, భీమవరం మీదుగా నర్సాపూర్ చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఏపీ - తెలంగాణ మధ్య మరో వీక్లీ ఎక్స్‌ప్రెస్..
తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త వినిపించింది. ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ మధ్య మరో వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. చర్లపల్లి - నర్సాపూర్ మధ్య ఎక్స్‌ప్రెస్ రైలు రాకపోకలు సాగించనుంది. చర్లపల్లి రైల్వేస్టేషన్‍లో ప్రారంభమయ్యే ఈ రైలు నల్గొండ, గుంటూరు, విజయవాడ రైల్వేస్టేషన్, భీమవరం మీదుగా నర్సాపూర్ చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.