సింగరేణిని దోచుకుంటున్న ప్రభుత్వం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే
సింగరేణి సంస్థ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. సింగరేణి సంస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని ఆయన స్పష్టం చేశారు.