2003 నాటి హత్య కేసులో.. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి కుమారుడికి శిక్ష

ఛత్తీస్‌గఢ్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ఉమ్మడి రాష్ట్రాల కాలం నాటి ఎన్సీపీ నేత రామావతార్ జగ్గీ హత్య కేసులో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత న్యాయం గెలిచింది. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత అజిత్ జోగి కుమారుడు, జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జె) అధ్యక్షుడు అమిత్ జోగిని ఈ హత్య కేసులో దోషిగా తేలుస్తూ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు గురువారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. మూడు వారాల వ్యవధిలో కోర్టు ముందు లొంగిపోవాలని అమిత్ జోగిని ధర్మాసనం ఆదేశించింది.

2003 నాటి హత్య కేసులో.. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి కుమారుడికి శిక్ష
ఛత్తీస్‌గఢ్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ఉమ్మడి రాష్ట్రాల కాలం నాటి ఎన్సీపీ నేత రామావతార్ జగ్గీ హత్య కేసులో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత న్యాయం గెలిచింది. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత అజిత్ జోగి కుమారుడు, జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జె) అధ్యక్షుడు అమిత్ జోగిని ఈ హత్య కేసులో దోషిగా తేలుస్తూ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు గురువారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. మూడు వారాల వ్యవధిలో కోర్టు ముందు లొంగిపోవాలని అమిత్ జోగిని ధర్మాసనం ఆదేశించింది.