"ఇరాన్ యుద్ధం సాకుతో మాపై దాడిచేస్తే..!": పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ గట్టి వార్నింగ్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం వేళ.. పాకిస్థాన్ భారత్‌పై ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే మునుపెన్నడూ చూడని రీతిలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. గతేడాది పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌ను కూడా గుర్తు చేశారు. పాక్ మన దేశంపై దాడి చేసిన ప్రతీసారి.. గట్టిగా బదులు ఇస్తున్నామని, పాక్‌ను కోలుకోలేని దెబ్బ తీస్తున్నామని అన్నారు. ఇప్పుడు కూడా పాక్ అదే తీరులో ప్రవర్తిస్తే.. భారత్ మరింత నిర్ణయాత్మకంగా అడుగు ముందుకేస్తుందని అన్నారు.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం వేళ.. పాకిస్థాన్ భారత్‌పై ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే మునుపెన్నడూ చూడని రీతిలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అంటూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. గతేడాది పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌ను కూడా గుర్తు చేశారు. పాక్ మన దేశంపై దాడి చేసిన ప్రతీసారి.. గట్టిగా బదులు ఇస్తున్నామని, పాక్‌ను కోలుకోలేని దెబ్బ తీస్తున్నామని అన్నారు. ఇప్పుడు కూడా పాక్ అదే తీరులో ప్రవర్తిస్తే.. భారత్ మరింత నిర్ణయాత్మకంగా అడుగు ముందుకేస్తుందని అన్నారు.