75 ఏళ్ల వయసులో 35 ఏళ్ల మహిళతో పెళ్లి.. వివాహమైన తెల్లారే మృతి
75 ఏళ్ల వయసులో 35 ఏళ్ల మహిళతో పెళ్లి.. వివాహమైన తెల్లారే మృతి
ఆయనకు 75.. ఆమెకు 35.. వృద్ధాప్యంలో తోడు కోసం ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కానీ, తాళికట్టి మనువాడిన మరుసటిరోజే వరుడు కన్నుమూశాడు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లా కుచ్ముచ్ గ్రామంలో చోటు చేసుకుంది. కుచ్ముచ్ గ్రామానికి చెందిన 75 ఏళ్ల సంగ్రూమ్ సంవత్సరం క్రితం భార్యను కోల్పోయాడు. అప్పటి నుంచీ ఒంటరిగానే జీవిస్తున్నాడు. సంతానం కూడా లేకపోవడంతో వ్యవసాయం చేస్తూ జీవితాన్ని నెట్టికొచ్చాడు. అయితే ఈ వయసులో ఒంటరిగా ఉండడం ఏమాత్రం ఇష్టం లేని సంగ్రూమ్.. మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అదే విషయాన్ని కుటుంబ సభ్యులు, బంధువులకు చెప్పాడు. కానీ వారంతా వద్దని వారించారు. ఈ వయసులో పెళ్లొద్దని సలహా ఇచ్చారు. అయినా వారి మాట వినని సంగ్రూమ్.. పెళ్లికి సిద్ధం అయ్యాడు. అయితే, తన వయసుకు తగ్గ మహిళను చూసుకొని పెళ్లి చేసుకోవడానికి బదులుగా తనకంటే 40 ఏళ్లు చిన్నది అయిన 35 ఏళ్ల అమ్మాయిని వివాహమాడాడు.సెప్టెంబర్ 29వ తేదీన జలాల్పూర్ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల మన్భావతిని సంగ్రూమ్ పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట మొదట తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నారు. ఆ తర్వాత స్థానిక ఆలయంలో సంప్రదాయబద్ధంగా వివాహ వేడుకను జరుపుకున్నారు. భవిష్యత్తులో పిల్లల్ని కూడా కని సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి రోజు రాత్రి సంతోషంగానే గడిపారు. కానీ తెల్లారేసరికే సంగ్రూమ్ చనిపోయాడు.సెప్టెంబర్ 30వ తేదీ తెల్లవారుజామున సంగ్రూమ్ అనారోగ్యానికి గురయ్యాడు. ఈ విషయాన్ని వెంటనే మన్భావతి తన కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు హుటాహుటిన సంగ్రూమ్ను ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడకు వెళ్లేలోపే సంగ్రూమ్ ప్రాణాలు కోల్పోయాడు. అతడి మృతదేహాన్ని తీసుకుని కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకున్నారు. అయితే, సంగ్రూమ్ హఠాన్మరణం గ్రామంలో పలు ఊహాగానాలకు, అనుమానాలకు తావిచ్చింది. కొందరు గ్రామస్థులు ఇది వయసు రీత్యా సంభవించిన సహజ మరణంగా భావిస్తుండగా.. మరికొందరు మాత్రం ఈ పరిణామాలు అనుమానాస్పదంగా ఉన్నాయని అంటున్నారు. ఈ సంఘటనపై మృతుడి బంధువులు, ముఖ్యంగా ఢిల్లీలో నివసించే ఆయన మేనల్లుళ్లు జోక్యం చేసుకున్నారు. తమ కుటుంబ సభ్యులు వచ్చే వరకు అంత్యక్రియలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దీంతో అంత్యక్రియలు ఆగిపోయాయి. వయసులో ఇంత తేడా ఉన్న మహిళను వివాహం చేసుకోవడం, వెంటనే వరుడు మరణించడం వంటి పరిణామాలతో.. స్థానికులు పోలీసు విచారణ జరిపించాలని లేదా పోస్టుమార్టం నిర్వహించాలని కోరుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
ఆయనకు 75.. ఆమెకు 35.. వృద్ధాప్యంలో తోడు కోసం ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కానీ, తాళికట్టి మనువాడిన మరుసటిరోజే వరుడు కన్నుమూశాడు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లా కుచ్ముచ్ గ్రామంలో చోటు చేసుకుంది. కుచ్ముచ్ గ్రామానికి చెందిన 75 ఏళ్ల సంగ్రూమ్ సంవత్సరం క్రితం భార్యను కోల్పోయాడు. అప్పటి నుంచీ ఒంటరిగానే జీవిస్తున్నాడు. సంతానం కూడా లేకపోవడంతో వ్యవసాయం చేస్తూ జీవితాన్ని నెట్టికొచ్చాడు. అయితే ఈ వయసులో ఒంటరిగా ఉండడం ఏమాత్రం ఇష్టం లేని సంగ్రూమ్.. మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అదే విషయాన్ని కుటుంబ సభ్యులు, బంధువులకు చెప్పాడు. కానీ వారంతా వద్దని వారించారు. ఈ వయసులో పెళ్లొద్దని సలహా ఇచ్చారు. అయినా వారి మాట వినని సంగ్రూమ్.. పెళ్లికి సిద్ధం అయ్యాడు. అయితే, తన వయసుకు తగ్గ మహిళను చూసుకొని పెళ్లి చేసుకోవడానికి బదులుగా తనకంటే 40 ఏళ్లు చిన్నది అయిన 35 ఏళ్ల అమ్మాయిని వివాహమాడాడు.సెప్టెంబర్ 29వ తేదీన జలాల్పూర్ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల మన్భావతిని సంగ్రూమ్ పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట మొదట తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నారు. ఆ తర్వాత స్థానిక ఆలయంలో సంప్రదాయబద్ధంగా వివాహ వేడుకను జరుపుకున్నారు. భవిష్యత్తులో పిల్లల్ని కూడా కని సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి రోజు రాత్రి సంతోషంగానే గడిపారు. కానీ తెల్లారేసరికే సంగ్రూమ్ చనిపోయాడు.సెప్టెంబర్ 30వ తేదీ తెల్లవారుజామున సంగ్రూమ్ అనారోగ్యానికి గురయ్యాడు. ఈ విషయాన్ని వెంటనే మన్భావతి తన కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు హుటాహుటిన సంగ్రూమ్ను ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడకు వెళ్లేలోపే సంగ్రూమ్ ప్రాణాలు కోల్పోయాడు. అతడి మృతదేహాన్ని తీసుకుని కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకున్నారు. అయితే, సంగ్రూమ్ హఠాన్మరణం గ్రామంలో పలు ఊహాగానాలకు, అనుమానాలకు తావిచ్చింది. కొందరు గ్రామస్థులు ఇది వయసు రీత్యా సంభవించిన సహజ మరణంగా భావిస్తుండగా.. మరికొందరు మాత్రం ఈ పరిణామాలు అనుమానాస్పదంగా ఉన్నాయని అంటున్నారు. ఈ సంఘటనపై మృతుడి బంధువులు, ముఖ్యంగా ఢిల్లీలో నివసించే ఆయన మేనల్లుళ్లు జోక్యం చేసుకున్నారు. తమ కుటుంబ సభ్యులు వచ్చే వరకు అంత్యక్రియలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దీంతో అంత్యక్రియలు ఆగిపోయాయి. వయసులో ఇంత తేడా ఉన్న మహిళను వివాహం చేసుకోవడం, వెంటనే వరుడు మరణించడం వంటి పరిణామాలతో.. స్థానికులు పోలీసు విచారణ జరిపించాలని లేదా పోస్టుమార్టం నిర్వహించాలని కోరుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.