AP Weather Update: ఏపీలో విభిన్న వాతావరణం...ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు

రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్న నేపధ్యంలో ఎండతీవ్రత, పిడుగులతో కూడిన అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తెలంగాణ, రాయలసీమ, అంతర తమిళనాడు మీదుగా మన్నార్ వరకు ద్రోణి కొనసాగుతుందని తెలిపారు. దీని ప్రభావంతో గురువారం (09-04-26) కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి తూర్పుగోదావరి(జి) పైడిమెట్టలో 44మిమీ, కాకినాడ(జి) డి.పోలవరంలో 37.7మిమీ, తూర్పుగోదావరి(జి) సీతానగరంలో 32.2మిమీ, అనకాపల్లి(జి) పాయకరావుపేటలో 26మిమీ చొప్పున అధిక వర్షపాతం నమోదైందని తెలిపారు., News News, Times Now Telugu

AP Weather Update: ఏపీలో విభిన్న వాతావరణం...ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు
రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్న నేపధ్యంలో ఎండతీవ్రత, పిడుగులతో కూడిన అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తెలంగాణ, రాయలసీమ, అంతర తమిళనాడు మీదుగా మన్నార్ వరకు ద్రోణి కొనసాగుతుందని తెలిపారు. దీని ప్రభావంతో గురువారం (09-04-26) కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి తూర్పుగోదావరి(జి) పైడిమెట్టలో 44మిమీ, కాకినాడ(జి) డి.పోలవరంలో 37.7మిమీ, తూర్పుగోదావరి(జి) సీతానగరంలో 32.2మిమీ, అనకాపల్లి(జి) పాయకరావుపేటలో 26మిమీ చొప్పున అధిక వర్షపాతం నమోదైందని తెలిపారు., News News, Times Now Telugu