Vizag Metro: చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సీఎం చంద్రబాబు నాయుడుకు స్వయంగా తెలియజేసినట్లు సమాచారం. విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలోనే విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Vizag Metro: చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సీఎం చంద్రబాబు నాయుడుకు స్వయంగా తెలియజేసినట్లు సమాచారం. విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలోనే విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.