"ఇండియాను చూసి నేర్చుకోండి": భారత్-అమెరికా డీల్‌‌తో పాలకులపై పాక్ ప్రజల ఆగ్రహం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత్ కుదుర్చుకున్న భారీ వాణిజ్య ఒప్పందం పాకిస్థాన్ పాలకులను తీవ్ర విమర్శలకు గురి చేస్తోంది. ముఖ్యంగా న్యూఢిల్లీ తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడుకుంటూ 18 శాతం సుంకాన్ని సాధించగా.. అమెరికాను ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన పాకిస్థాన్ మాత్రం 19 శాతం టారిఫ్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఒక్క శాతం వ్యత్యాసమే.. ప్రస్తుతం పాక్ ప్రభుత్వాన్ని సొంత ప్రజలే నిలదీసే పరిస్థితికి చేర్చింది. ముఖ్యంగా భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ ఆదేశ ప్రజలు చెప్పడం గమనార్హంగా నిలుస్తోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత్ కుదుర్చుకున్న భారీ వాణిజ్య ఒప్పందం పాకిస్థాన్ పాలకులను తీవ్ర విమర్శలకు గురి చేస్తోంది. ముఖ్యంగా న్యూఢిల్లీ తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడుకుంటూ 18 శాతం సుంకాన్ని సాధించగా.. అమెరికాను ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన పాకిస్థాన్ మాత్రం 19 శాతం టారిఫ్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఒక్క శాతం వ్యత్యాసమే.. ప్రస్తుతం పాక్ ప్రభుత్వాన్ని సొంత ప్రజలే నిలదీసే పరిస్థితికి చేర్చింది. ముఖ్యంగా భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ ఆదేశ ప్రజలు చెప్పడం గమనార్హంగా నిలుస్తోంది.