"ఒక్క రాత్రిలోనే ఇరాన్ మొత్తాన్ని తుడిచి పెట్టేస్తాం": ట్రంప్ తీవ్ర హెచ్చరిక

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌ను కేవలం ఒక్క రాత్రిలో సర్వనాశనం చేయగలమంటూ హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించిన నేపథ్యంలో.. మంగళవారం నాటితో ఆ దేశ కథ ముగిసిపోవచ్చని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం రేపుతున్నాయి. శత్రువుల కళ్లుగప్పి తమ ఎఫ్‌-15 పైలట్‌ను రక్షించుకోవడానికి ఏకంగా 64 యుద్ధ విమానాలు, భారీ బాంబర్లను వాడినట్లు కూడా ఆయన స్పష్టం చేశారు. అలాగే ఈ ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారం లీక్ అయిందని.. ద్రోహులకు శిక్ష తప్పదని హెచ్చరించారు.

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌ను కేవలం ఒక్క రాత్రిలో సర్వనాశనం చేయగలమంటూ హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించిన నేపథ్యంలో.. మంగళవారం నాటితో ఆ దేశ కథ ముగిసిపోవచ్చని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం రేపుతున్నాయి. శత్రువుల కళ్లుగప్పి తమ ఎఫ్‌-15 పైలట్‌ను రక్షించుకోవడానికి ఏకంగా 64 యుద్ధ విమానాలు, భారీ బాంబర్లను వాడినట్లు కూడా ఆయన స్పష్టం చేశారు. అలాగే ఈ ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారం లీక్ అయిందని.. ద్రోహులకు శిక్ష తప్పదని హెచ్చరించారు.