మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలపై కీలక అప్‌డేట్.. ఓటరు జాబితా తయారీకి ఎస్‌ఈసీ కసరత్తు..

తెలంగాణలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఓటర్ల జాబితా సవరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025 డిసెంబర్ 30 నుండి 2026 జనవరి 10 వరకు ఈ జాబితా తయారీ ప్రక్రియ కొనసాగుతుంది. కేంద్ర ఆర్థిక సంఘం నుండి రావాల్సిన సుమారు రూ.700 కోట్ల నిధుల కోసం వచ్చే మార్చిలోగా ఎన్నికలు ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పురపాలక సంఘాలకు కొత్త పాలకవర్గాలను ఎన్నుకునేందుకు ఈ కసరత్తు కీలకం కానుంది. నిజామాబాద్, కరీంనగర్ వంటి ప్రధాన నగరాల్లోనూ ఓటర్ల నమోదు ముమ్మరంగా సాగనుంది.

మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలపై కీలక అప్‌డేట్.. ఓటరు జాబితా తయారీకి ఎస్‌ఈసీ కసరత్తు..
తెలంగాణలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఓటర్ల జాబితా సవరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025 డిసెంబర్ 30 నుండి 2026 జనవరి 10 వరకు ఈ జాబితా తయారీ ప్రక్రియ కొనసాగుతుంది. కేంద్ర ఆర్థిక సంఘం నుండి రావాల్సిన సుమారు రూ.700 కోట్ల నిధుల కోసం వచ్చే మార్చిలోగా ఎన్నికలు ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పురపాలక సంఘాలకు కొత్త పాలకవర్గాలను ఎన్నుకునేందుకు ఈ కసరత్తు కీలకం కానుంది. నిజామాబాద్, కరీంనగర్ వంటి ప్రధాన నగరాల్లోనూ ఓటర్ల నమోదు ముమ్మరంగా సాగనుంది.