లడఖ్‌లో మరో 5 కొత్త జిల్లాల ఏర్పాటు.. అమిత్ షా పర్యటన వేళ కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం

లడఖ్ ప్రజల దశాబ్దాల కల నెరవేరుస్తూ కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం రెండు జిల్లాలకే పరిమితమైన లడఖ్‌ను ఏడు జిల్లాల ప్రాంతంగా మార్చింది. ముఖ్యంగా కొత్తగా ఐదు జిల్లాలను ఏర్పాటు చేసినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సోమవారం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. లడఖ్‌లోని ప్రతీ ఇంటికి ప్రభుత్వ పథకాలు అందజేయాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనకు రెండు రోజుల ముందే ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం.

లడఖ్‌లో మరో 5 కొత్త జిల్లాల ఏర్పాటు.. అమిత్ షా పర్యటన వేళ కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం
లడఖ్ ప్రజల దశాబ్దాల కల నెరవేరుస్తూ కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం రెండు జిల్లాలకే పరిమితమైన లడఖ్‌ను ఏడు జిల్లాల ప్రాంతంగా మార్చింది. ముఖ్యంగా కొత్తగా ఐదు జిల్లాలను ఏర్పాటు చేసినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సోమవారం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. లడఖ్‌లోని ప్రతీ ఇంటికి ప్రభుత్వ పథకాలు అందజేయాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనకు రెండు రోజుల ముందే ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం.