ఆధార్ అప్డేట్ ఛార్జీలు పెంపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి.. దేనికి ఎంతంటే?
ఆధార్ అప్డేట్ ఛార్జీలు పెంపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి.. దేనికి ఎంతంటే?
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆధార్ అప్డేట్ సేవలకు సంబంధించిన రుసుములను పెంచింది. ఈ పెంపుదల కారణంగా ఇకపై మీ పేరు, చిరునామా వంటి డెమోగ్రాఫిక్ వివరాలను మార్చుకోవడానికి.. అలాగే వేలిముద్రలు, కనుపాపల స్కానింగ్ వంటి బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయడానికి అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ సవరించిన ధరలు సెప్టెంబర్ 30వ తేదీ 2028 వరకు అమలులో ఉంటాయి. అయితే చిన్నపిల్లలకు సంబంధించిన తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్లు మాత్రం ఉచితంగా కొనసాగుతాయని UIDAI స్పష్టం చేసింది.
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆధార్ అప్డేట్ సేవలకు సంబంధించిన రుసుములను పెంచింది. ఈ పెంపుదల కారణంగా ఇకపై మీ పేరు, చిరునామా వంటి డెమోగ్రాఫిక్ వివరాలను మార్చుకోవడానికి.. అలాగే వేలిముద్రలు, కనుపాపల స్కానింగ్ వంటి బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయడానికి అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ సవరించిన ధరలు సెప్టెంబర్ 30వ తేదీ 2028 వరకు అమలులో ఉంటాయి. అయితే చిన్నపిల్లలకు సంబంధించిన తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్లు మాత్రం ఉచితంగా కొనసాగుతాయని UIDAI స్పష్టం చేసింది.