ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. అనర్హులుగా 2 వేల 500 మంది గుర్తింపు.. కారణం ఇదే..

నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే ఈ సాయం నిజమైన పేదలకే అందాలనే లక్ష్యంతో అధికారులు క్షేత్రస్థాయిలో కఠినంగా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,500 మంది అనర్హులను గుర్తించి వారి నిధులను నిలిపివేశారు. ముఖ్యంగా సొంతంగా కారు ఉన్నవారు.. గతంలోనే ప్రభుత్వ ఇంటి సాయం పొందిన వారు ఈ పథకానికి అనర్హులని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.48 లక్షల ఇళ్ల నిర్మాణం సాగుతుండగా.. ప్రభుత్వం ఇప్పటివరకు 3,800 కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. అనర్హులుగా 2 వేల 500 మంది గుర్తింపు.. కారణం ఇదే..
నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే ఈ సాయం నిజమైన పేదలకే అందాలనే లక్ష్యంతో అధికారులు క్షేత్రస్థాయిలో కఠినంగా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,500 మంది అనర్హులను గుర్తించి వారి నిధులను నిలిపివేశారు. ముఖ్యంగా సొంతంగా కారు ఉన్నవారు.. గతంలోనే ప్రభుత్వ ఇంటి సాయం పొందిన వారు ఈ పథకానికి అనర్హులని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.48 లక్షల ఇళ్ల నిర్మాణం సాగుతుండగా.. ప్రభుత్వం ఇప్పటివరకు 3,800 కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది.