"ఇరాన్ తదుపరి నాయకుడెవరో నాకు తెలుసు": ఖమేనీ మరణం తర్వాత ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఓవైపు ట్రంప్, మరోవైపు ఇజ్రాయెల్ ఈ వార్తను ముందే చెప్పగా.. ఇరాన్ ప్రభుత్వ మీడియా మాత్రం కాస్త ఆలస్యంగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అయితే ఇది జరిగిన కాసేపటికే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్లు చేశారు. ముఖ్యంగా ఇరాన్ తదుపరి నాయకుడు ఎవరో తనకు తెలుసని చెప్పారు. అక్కడితో ఆగకుండా ఇరాన్ నేతలే తనకు ఫోన్ చేసి మరీ ఎవరిని వారసుడినిగా నియమించాలో సలహా అడుగుతారని.. ఇకపై ఇరు దేశాల మధ్య చర్చలు సులభం అవుతాయని స్పష్టం చేశారు.

అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఓవైపు ట్రంప్, మరోవైపు ఇజ్రాయెల్ ఈ వార్తను ముందే చెప్పగా.. ఇరాన్ ప్రభుత్వ మీడియా మాత్రం కాస్త ఆలస్యంగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అయితే ఇది జరిగిన కాసేపటికే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్లు చేశారు. ముఖ్యంగా ఇరాన్ తదుపరి నాయకుడు ఎవరో తనకు తెలుసని చెప్పారు. అక్కడితో ఆగకుండా ఇరాన్ నేతలే తనకు ఫోన్ చేసి మరీ ఎవరిని వారసుడినిగా నియమించాలో సలహా అడుగుతారని.. ఇకపై ఇరు దేశాల మధ్య చర్చలు సులభం అవుతాయని స్పష్టం చేశారు.