ఉత్తరాదిని చుట్టేసిన ‘కాషాయం ఎక్స్ప్రెస్’.. ఇప్పుడు దక్షిణాది డెల్టాపై గురి..!
ఉత్తరాదిని చుట్టేసిన ‘కాషాయం ఎక్స్ప్రెస్’.. ఇప్పుడు దక్షిణాది డెల్టాపై గురి..!
సోషల్ మీడియాలో ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ సర్క్యులేట్ అవుతోంది. మోదీ-షా అశ్వమేధ యాగం చేస్తున్నారట. ఒక్కో రాజ్యాన్ని చేజిక్కించుకుంటూ, అధికారానికి అడ్డొచ్చిన చోట, రాజకీయ యుద్ధం చేయాల్సి చోట రణరంగానికి దిగుతూ, గెలుస్తూ పోతోందట. నదుల అనుసంధానంలో భాగంగా గంగా-కావేరీని కలపాలనే ప్రతిపాదన ఉంది. బీజేపీ తన రాజకీయ అనుసంధానంలో భాగంగా ఇదే గంగా-కావేరీని లక్ష్యంగా తీసుకుంది. గంగా బెల్ట్ నుంచి కావేరీ డెల్టా వరకు.. ఆ నదులు పారే ప్రతి రాష్ట్రంలో పాగా వేయాలనేది కమలదళం టార్గెట్. ఇప్పటికే ఉత్తరాదిన గంగా-యమునా బెల్ట్ను క్లీన్ స్వీప్ చేసింది బీజేపీ. గంగోత్రి దగ్గర మొదలైన ఈ జైత్రయాత్ర, మొన్న బెంగాల్ కోటను దాటుకుని గంగాసాగర్ను ముద్దాడింది. అంటే.. గంగా బెల్ట్ ఇస్ కంప్లీట్లీ లాక్డ్! ఇప్పుడిక తన ఎక్స్పాన్షన్ మోడ్కు మరింత పదును పెట్టి, పొలిటికల్ కంపాస్ను సౌత్ వైపు తిప్పింది. తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా-గోదావరి బేసిన్ నుంచి కావేరీ వరకు.. ఈ రాష్ట్రాల ఓటు బ్యాంకును కాషాయంతో కనెక్ట్ చేయడమే మెయిన్ అజెండాగా వెళ్తోంది. ఆల్రడీ మహారాష్ట్రలో అధికారంలో ఉంది. కర్నాటకలో అధికారంలోకి వచ్చిపోయింది. ఇప్పుడిక తెలంగాణ వంతు. మే 10న మోదీ అడుగుపెడుతున్నారంటే.. మరో 'పొలిటికల్ టార్గెట్' సెట్ చేయడానికేనా! ఉత్తరాది నుంచి దక్షిణాది దాకా విస్తరించడానికి బీజేపీ వేస్తున్న నయా స్కెచ్ ఏంటి? ఎలాంటి వ్యూహాలతో వెళ్తోంది?
సోషల్ మీడియాలో ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ సర్క్యులేట్ అవుతోంది. మోదీ-షా అశ్వమేధ యాగం చేస్తున్నారట. ఒక్కో రాజ్యాన్ని చేజిక్కించుకుంటూ, అధికారానికి అడ్డొచ్చిన చోట, రాజకీయ యుద్ధం చేయాల్సి చోట రణరంగానికి దిగుతూ, గెలుస్తూ పోతోందట. నదుల అనుసంధానంలో భాగంగా గంగా-కావేరీని కలపాలనే ప్రతిపాదన ఉంది. బీజేపీ తన రాజకీయ అనుసంధానంలో భాగంగా ఇదే గంగా-కావేరీని లక్ష్యంగా తీసుకుంది. గంగా బెల్ట్ నుంచి కావేరీ డెల్టా వరకు.. ఆ నదులు పారే ప్రతి రాష్ట్రంలో పాగా వేయాలనేది కమలదళం టార్గెట్. ఇప్పటికే ఉత్తరాదిన గంగా-యమునా బెల్ట్ను క్లీన్ స్వీప్ చేసింది బీజేపీ. గంగోత్రి దగ్గర మొదలైన ఈ జైత్రయాత్ర, మొన్న బెంగాల్ కోటను దాటుకుని గంగాసాగర్ను ముద్దాడింది. అంటే.. గంగా బెల్ట్ ఇస్ కంప్లీట్లీ లాక్డ్! ఇప్పుడిక తన ఎక్స్పాన్షన్ మోడ్కు మరింత పదును పెట్టి, పొలిటికల్ కంపాస్ను సౌత్ వైపు తిప్పింది. తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా-గోదావరి బేసిన్ నుంచి కావేరీ వరకు.. ఈ రాష్ట్రాల ఓటు బ్యాంకును కాషాయంతో కనెక్ట్ చేయడమే మెయిన్ అజెండాగా వెళ్తోంది. ఆల్రడీ మహారాష్ట్రలో అధికారంలో ఉంది. కర్నాటకలో అధికారంలోకి వచ్చిపోయింది. ఇప్పుడిక తెలంగాణ వంతు. మే 10న మోదీ అడుగుపెడుతున్నారంటే.. మరో 'పొలిటికల్ టార్గెట్' సెట్ చేయడానికేనా! ఉత్తరాది నుంచి దక్షిణాది దాకా విస్తరించడానికి బీజేపీ వేస్తున్న నయా స్కెచ్ ఏంటి? ఎలాంటి వ్యూహాలతో వెళ్తోంది?