కదులుతున్న రైల్లో పూజా కార్యక్రమం.. వైరల్ వీడియోపై స్పందించిన రైల్వే

ఇటీవల ఫస్ట్‌ క్లాస్ ఏసీ కోచ్‌లోని ఓ కూపేలో కొత్త జంట శోభనం డెకరేషన్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు దీనిని అనుమతించిన టీటీఈపై సస్పెన్షన్ వేటు పడింది. బల్లార్ష నుంచి ముంబయి వెళ్లే నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. తాజాగా, మరో ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. అయితే, రైల్లో పూజా కార్యక్రమం నిర్వహిస్తున్న వీడియోపై నెట్టింట విమర్శలు రావడంతో రైల్వే శాఖ స్పందించింది. అది సెలూన్ కోచ్ అని రైల్వే శాఖ వివరణ ఇచ్చింది.

కదులుతున్న రైల్లో పూజా కార్యక్రమం.. వైరల్ వీడియోపై స్పందించిన రైల్వే
ఇటీవల ఫస్ట్‌ క్లాస్ ఏసీ కోచ్‌లోని ఓ కూపేలో కొత్త జంట శోభనం డెకరేషన్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు దీనిని అనుమతించిన టీటీఈపై సస్పెన్షన్ వేటు పడింది. బల్లార్ష నుంచి ముంబయి వెళ్లే నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. తాజాగా, మరో ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. అయితే, రైల్లో పూజా కార్యక్రమం నిర్వహిస్తున్న వీడియోపై నెట్టింట విమర్శలు రావడంతో రైల్వే శాఖ స్పందించింది. అది సెలూన్ కోచ్ అని రైల్వే శాఖ వివరణ ఇచ్చింది.